byసూర్య | Thu, Mar 28, 2024, 12:55 PM
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో బుసిరెడ్డిపల్లిలో గురువారం వివాహానికి హాజరవుతున్న తరుణంలో మార్గమధ్యలో బొలెరో వాహనం చెట్టుకు ఢీకొంది. నాగసానిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వనపర్తి జిల్లా అధ్యక్షుడు శ్రీరంగాపురం జడ్పిటిసి రాజేంద్రప్రసాద్ యాదవ్, మండల అధ్యక్షుడు రాములు యాదవ్ డాక్టర్లతో మాట్లాడి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు.