byసూర్య | Thu, Mar 28, 2024, 12:57 PM
వనపర్తి జిల్లా అమరచింత మండలం కామరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజు(22) పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు ప్రస్తావన తీసుకురావడంతో నిరాకరించిన అతను మనస్తాపానికి గురై మన్యంకొండ దేవస్థానం సమీపంలో చెట్టుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు గురువారం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు.