byసూర్య | Thu, Mar 28, 2024, 12:59 PM
భిక్కనూరు మండల పరిధిలోని బీటిఎస్ లో గల టీయూ దక్షిణ ప్రాంగణం, సామాజిక శాస్త్రం విభాగం, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా సోషల్ వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరభద్రం నియమితులయ్యారు. బుధవారం ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. వీరభద్రం మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సామాజిక శాస్త్రం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డెన్ యాలాద్రి ఉన్నారు.