byసూర్య | Sun, Dec 03, 2023, 04:14 PM
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపోంది అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరిన 10 మందిలో ప్రజలు 9 మందిని ఈ ఎన్నికల్లో తిరస్కరించారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్రావు, పినపాకలో రేగా కాంతారావు, ఇల్లెందులో హరిప్రియ నాయక్, నకిరేకల్లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి , పాలేరులో ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఎల్లారెడ్డిలో సురేందర్ (కాంగ్రెస్), కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్), తాండూరులో పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ఎన్నికల్లో ఓడించారు.
వీరిలో ఒక్క సబితా ఇంద్రారెడ్డి మాత్రమే గెలుపోందరు. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి ఈ సారి అధికార పార్టీ నుంచి పోటి చేసీ ఓటమి చవి చుసిన టీడీపీ ఆభ్యర్ధులు వీరే సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వర్ రావు