ఆర్జీవీ సంచలన ట్వీట్

byసూర్య | Sun, Dec 03, 2023, 04:14 PM

ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో 'హస్త' గతం చేసుకున్న కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ దిశగా వేగంగా వెళ్తోంది.దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు పలువురు ప్రముఖులు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, నాయకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాపై తనదైన శైలిలో స్పందించారు. హాయ్ రాహుల్ గాంధీజీ, సోనియా గాంధీజీ, చాలా సంవత్సరాల తర్వాత మొదటి సారి కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు విపరీతమైన గౌరవం వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కాబోతున్నారంటూ ట్వీట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'హాయ్ రాహుల్ గాంధీజీ, సోనియా గాంధీజీ, చాలా సంవత్సరాల తర్వాత మొదటి సారి కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు విపరీతమైన గౌరవం వచ్చింది. ఎందుకో తెలుసా? రేవంత్‌ రెడ్డి తెలంగాణకు సీఎం కాబోతున్నారు' అని ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ. ప్ర స్తుతం ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


 


కాగా మొత్తం 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 41 స్థానాల్లో విజయం సాధించింది. మరో 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 17 స్థానాల్లో గెలుపొందగా, మరో 19 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక కామారెడ్డిలో మాత్రం ఉత్కంఠ పోరు సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండగా, సీఎం కేసీఆర్‌ మూడో స్థానంలో ఉన్నారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM