byసూర్య | Sun, Dec 03, 2023, 04:19 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు సత్తా చాటారు. వారితో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలో పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేశారు. ఖమ్మం జిల్లా మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్నగర్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జైవీర్రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.