బ్లాక్‌మెయిలర్ సీఎం కాకూడదు..,,వైఎస్ షర్మిల

byసూర్య | Sat, Dec 02, 2023, 06:51 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా చర్చనడుస్తున్న వేళ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టనుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యంలో.. ఒకవేళ నిజంగానే హస్తం పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరూ అన్న చర్చ జోరుగా సాగుతోంది. పలువురి పేర్లతో పాటు మంత్రి వర్గంలో ఉండనున్న నేతల పేర్లు శాఖలతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇదే అంశంపై కూడా షర్మిల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో సమర్థులైన సీఎం అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారని అభిప్రాయ పడిన షర్మిల.. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇద్దరూ ఆ పదవికి అర్హులేనన్నారు. ఇక బ్లాక్‌మెయిలర్స్‌ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదంటూ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఆ పార్టీ నాయకత్వం డిసైడ్ చేస్తుందన్నారు.


అంతేకాకుండా.. సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్ కూడా పంపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు గుడ్ బై చెప్పే టైం వచ్చిందని.. షర్మిల తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా "బై బై కేసీఆర్" అంటున్నారని అభిప్రాయపడిన షర్మిల.. బైబై కేసీఆర్ అని ఉన్న సూట్ కేసును కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు తెలిపారు. రేపటితో కేసీఆర్ అవినీతి, అక్రమ, నియంతృత్వ పాలన పోవాలని కోరుకుంటున్నట్లు తెలిపిన షర్మిల... ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో తాము పోటీ చేస్తే కాంగ్రెస్‌ను సులంభంగా ఓడించేవాళ్లమని.. కానీ తమ లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమేనన్న షర్మిల.. అందుకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు షర్మిల స్పష్టం చేశారు. అయితే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం విషయంలో హస్తం పార్టీలోని సీనియర్ నేతలు పాజిటివ్‌గానే స్పందించగా.. రేవంత్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను పీసీసీగా ఉన్నంత కాలం.. ఏపీకి చెందిన వ్యక్తులను రానివ్వనంటూ షర్మిలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే.. విలీనం అంశం పక్కన పెట్టేసి.. ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ఇచ్చింది షర్మిల. దీంతో.. పార్టీలోకి తనను అడ్డుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అభ్యర్థిగా షర్మిల వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది.


Latest News
 

గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM
వర్షాకాలం రైతు భరోసా లేనట్లేనా: సంగారెడ్డి ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:53 PM
గూడూరు మండలం జెడ్ పి హెచ్ ఎస్ , తీగలవేణి ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా దుస్తుల పంపిణీ Sat, Oct 19, 2024, 04:15 PM