byసూర్య | Sat, Oct 19, 2024, 04:15 PM
మహబూబాద్ జిల్లా,గూడూరు మండల కేంద్రంలో, తెలుగు సమితి అఫ్ నేబ్రాస్కా, స్ఫూర్తి ఎడ్యుకేషన్ సొసైటీ సమితి వారి ఆధ్వర్యంలో, గూడూరు మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తీగలవేణిలలో క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు ఫారూఖ్ మాట్లాడుతూ.. స్ఫూర్తి ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులపై చూపించే ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా స్ఫూర్తి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామసహాయం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు అన్ని రకాలుగా సహకారం అందించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు క్రీడల్లో రాణించాలని, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలన్నారు. చదువుతో పాటూ క్రీడల్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో, ఈ క్రీడా దుస్తులు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణయ్య, జి .రాణి పి ఈ టి, ఉపాధ్యాయులు ఎ .ధర్మానాయక్, జె .పురుషోత్తం గౌడ్, పి . సాంబయ్య, సంపత్, లక్ష్మయ్య , నాగరత్న , రఫీ, మహేందర్, రవి, రాంప్రసాద్ విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.