'ఈ ఖరీఫ్‌ సీజన్‌కు కూడా రైతు భరోసా లేనట్టే

byసూర్య | Sat, Oct 19, 2024, 07:06 PM

తెలంగాణలో అన్నదాతలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై ఇప్పటికీ స్పష్టత రావట్లేదు. అయితే.. రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే సబ్ కమిటీ వేయగా.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించే పనిలో పడ్డారు. గత ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు డబ్బులు ఇచ్చారని.. కానీ తమ ప్రభుత్వంలో పకడ్బందీగా పథకాన్ని అమలు చేయనున్నట్టు మంత్రులు చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే.. అన్నదాతల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. సబ్ కమిటీ ఓ రిపోర్ట్ ఇవ్వనుందని.. ఆ రిపోర్టు వచ్చాకే రైతు భరోసా వేయనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.


కాగా.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలైప మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను భట్టి చూస్తూంటే.. ఈ ఖరీఫ్ సీజన్‌కు కూడా రైతు భరోసా లేనట్టేనని అర్థమవుతోందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల.. చావు కబురు చల్లగా చెప్పారంటూ తెలిపారు. ఈసారి ఎలాగైనా రైతు భ‌రోసా డబ్బులను అన్నదాతల అకౌంట్లలో వేస్తామ‌ని చెప్పి.. మాట త‌ప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాప‌ణ చెప్పి, ముక్కు నేల‌కు రాయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


తాము అధికారంలోకి వ‌స్తే రైతు భ‌రోసా పేరిట ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు హరీష్ రావు గుర్తిం చేశారు. వాళ్లు మాట ఇచ్చినట్టుగా రూ.15 వేలు కాదు కానీ.. గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ. 10 వేలు కూడా సరిగ్గా ఇవ్వకుండా రైతుల‌ను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడంటూ హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి చెంప‌లు వేసుకుని, ముక్కు నేల‌కు రాసి.. తెలంగాణ రైతులకు క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.


మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు త‌ప్పకుండా తిర‌గ‌బ‌డతారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. క‌రోనా స‌మ‌యంలో.. రాష్ట్రానికి ఆదాయం లేని సంద‌ర్భంలో కూడా అన్నదాతలందరికీ రైతుబంధు ఇచ్చామని గుర్తు చేసిన హరీష్ రావు.. ఇప్పుడు అన్ని బాగుండి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఉంటాయి కానీ.. రైతులకు రూ.15 వేలు ఇవ్వలేరా అంటూ నిలదీశారు. రైతులంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత ప‌గ‌ అంటూ ప్రశ్నించారు.


ఇప్పటికే.. రుణమాఫీ విషయంలో మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఇటు వడ్లకు బోనస్ విషయంలోనూ మోసం చేశారంటూ హరీష్ రావు కీలక ఆరోపణలు చేశారు. అయితే.. ఇప్పుడు రైతు బంధు విషయంలోనూ అన్నదాతలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం రైతుబంధు రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని.. అంతవరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదంటూ హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు.


Latest News
 

మియాపూర్‌లో సంచరించింది అడవిపిల్లిగా తేల్చిన అధికారులు Sat, Oct 19, 2024, 08:57 PM
మంత్రి సీతక్కను కలిసిన ములుగు గ్రంథాలయ ఛైర్మన్ Sat, Oct 19, 2024, 08:49 PM
పోలీసు అమరుల త్యాగాలను మరువద్దు: వరంగల్ కమిషనర్ Sat, Oct 19, 2024, 08:48 PM
గ్రంథాలయ ఛైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు Sat, Oct 19, 2024, 08:48 PM
సీఎం రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 08:46 PM