byసూర్య | Sat, Oct 19, 2024, 08:57 PM
మియాపూర్లో చిరుత పులి సంచారం అంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. స్థానిక మెట్రో స్టేషన్ వద్ద చిరుత సంచరిస్తోందని శుక్రవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయింది. దీంతో ఇవాళ ఉదయం అటవీశాఖ అధికారులు మెట్రో స్టేషన్ సమీపంలోని నడిగడ్డ తండా వద్దకు చేరుకుని ఆ ప్రాంతమంతా పరిశీలించారు. పాదముద్రలు గుర్తించి... ఆ ప్రాంతంలో సంచరించింది అడవి పిల్లి అని నిర్ధరించారు. ఈ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు.