byసూర్య | Wed, Nov 22, 2023, 10:44 AM
గ్రేటర్లో అన్ని ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని అందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అందివచ్చిన శుభకార్యంతో సహా ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. వారి డిమాండ్లు ఆరా తీసి నేరవేర్చేందుకు హామీ ఇస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వచ్చిన వారికి అడిగిన బ్రాండ్ మందు అందిస్తూ, కోరిన వంటకాలతో దావత్లు ఇస్తున్నారు.
తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు ఈసీ సమీక్ష చేపట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఎఫ్ఐఆర్లు, ఓటరు సమాచార పత్రాలు, ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతులపై ఆరా తీసే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.