byసూర్య | Wed, Nov 22, 2023, 10:43 AM
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, ఎన్నికల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధి, విధానాలపై వారు అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.