byసూర్య | Wed, Nov 22, 2023, 10:27 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘రైతు చెమట చుక్కల కష్టం తెల్సినోడు. అప్పుల పాలైన రైతు పురుగుమందులు తాగి మరణిస్తే కన్నీరు పెట్టినోడు. అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉండాలని పరితపించే రైతుబిడ్డ మన కేసీఆర్. కేసీఆర్ మానస పుత్రికే ఈ రైతుబంధు’’ అని కవిత ట్వీట్లో పేర్కొన్నారు.