గ్యారెంటీలపైనే కాంగ్రెస్ అశలన్నీ!

byసూర్య | Wed, Nov 22, 2023, 10:20 AM

కర్ణాటకలో 5 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇదే అస్త్రాన్ని తెలంగాణ, రాజస్థాన్‌లోనూ పాటిస్తోంది. తెలంగాణలో 6, రాజస్థాన్‌లో 7 గ్యారెంటీలను ప్రకటించింది. ఈ గ్యారెంటీలను ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మరి కర్ణాటక రిజల్డ్ తెలంగాణ, రాజస్థాన్‌లో రిపీట్ అవుతుందో లేదో చూడాలి.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వారం రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేడు 5 నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్‌లలో బహిరంగసభలుండగా.. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండనున్నాయి.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM