byసూర్య | Wed, Nov 22, 2023, 10:20 AM
కర్ణాటకలో 5 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇదే అస్త్రాన్ని తెలంగాణ, రాజస్థాన్లోనూ పాటిస్తోంది. తెలంగాణలో 6, రాజస్థాన్లో 7 గ్యారెంటీలను ప్రకటించింది. ఈ గ్యారెంటీలను ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మరి కర్ణాటక రిజల్డ్ తెలంగాణ, రాజస్థాన్లో రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వారం రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్యాంపెయిన్ను ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నేడు 5 నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్లలో బహిరంగసభలుండగా.. కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రోడ్షోలు ఉండనున్నాయి.