byసూర్య | Wed, Nov 22, 2023, 10:01 AM
ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పెద్దపీట వేస్తోంది. ఓటరు తాను వేసిన ఓటు సంబంధిత అభ్యర్థికే పడిందా లేదా తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం వీవీప్యాట్ను ప్రవేశపెట్టింది. ఓటరు ఈవీఎంలో ఓటు వేయగానే వీవీప్యాట్లో చూసుకోవాలి. ఇది అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తును ముద్రిస్తుంది. ఆ పేపరు ఏడు సెకన్లు మాత్రమే కనిపిస్తుంది. తర్వాత దానంతటదే వీవీప్యాట్ బాక్స్లో పడిపోతుంది.
తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు ఈసీ సమీక్ష చేపట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఎఫ్ఐఆర్లు, ఓటరు సమాచార పత్రాలు, ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతులపై ఆరా తీసే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.