కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన

byసూర్య | Sat, Sep 21, 2024, 12:00 PM

సాధారణంగా పూర్వ కాలం నుంచి ప్రేమ, ప్రేమికుల కోసం కుటుంబ తగాదాలు ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అయితే కాస్త ఎక్కువ అనే చెప్పాలి.ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మోసం చేసే వారు కొందరైతే.. ప్రేమ విఫలం అయిందని.. మరికొందరూ. ప్రేమను తమ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని ఆత్మహత్య చేసుకునే కొందరూ ఉన్నారు. కొందరూ కులం, మతం ఇలా రకరకాలుగా ప్రేమికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం కోనాపూర్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సాయికుమార్, వీణ లు గత కొంత కాలం గా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని వారిద్దరూ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన వీరు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డారని.. వీరి చావుకు ఇరు కుటుంబాల సభ్యులే కారణం అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వారి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకుంటే వారికి ఇలా జరిగేది కాదని పేర్కొంటున్నారు స్థానికులు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 


 


Latest News
 

ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం Sat, Sep 21, 2024, 01:36 PM
చిలుకూరు మండల స్థాయి బాల బాలికల క్రీడోత్సవాలు Sat, Sep 21, 2024, 01:35 PM
కుక్కలుబాబోయ్..కుక్కలు Sat, Sep 21, 2024, 01:33 PM
కొత్త గూడెం పాలవరం మేజర్ కాలువ కింద ఉన్న..రైతులు అధైర్య పడొద్దు.. Sat, Sep 21, 2024, 01:31 PM
ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Sep 21, 2024, 01:20 PM