byసూర్య | Sat, Sep 23, 2023, 12:21 PM
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఏఐటీయూసీ అధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరింది. పెండింగ్ బిల్లులు చెల్లించి వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు రామస్వామి, వెంకటేశ్వర్లు, వెంకట్రాములు మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.