byసూర్య | Sat, Sep 23, 2023, 12:23 PM
ఉరి వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని (17) పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బైపిసి పూర్తిచేసింది. నీట్ రాయగా క్వాలిఫై కాలేదు. దీంతో మనస్థాపం చెంది. గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.