byసూర్య | Sat, Sep 23, 2023, 12:24 PM
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ, శివనేని గూడెం లో శుక్రవారం పలు వినాయక విగ్రహాల వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.