నా ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజుల్ని మర్చిపోయావా హరీష్..: సీఎం రేవంత్ కౌంటర్

byసూర్య | Sat, Oct 19, 2024, 07:38 PM

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు, మూసీ పునరుజ్జీవంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కారు ముందు డ్యాన్స్ వేశాడని.. తాను గన్‌పార్క్ వద్ద పదవికి రిజైన్ చేసిన రోజు టీవీల్లో కనిపించేందుకు నా వెనకాలే నిలబడి నిక్కినిక్కి చూశాడని హరీష్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లకు సీఎం రేవంత్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.


తన ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్ రోజుల్ని హరీష్ రావు మర్చిపోయినట్లుందని రేవంత్ ఎద్దేవా చేశారు. చెప్పులు మోసే తనకు సవాల్ విసురుతున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రి గీతారెడ్డికి సద్భావనా అవార్టును ప్రధానం చేశారు. అనంతరం మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉందని ఫైరయ్యారు. నాడు నాలాలు, చెరువులు, ఆక్రమించుకున్న వారే నేడు 'హైడ్రా'ను చూసి భయపడుతున్నారని ఫైరయ్యారు. ఇదే హైడ్రాను బూచిగా చూపించి నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుదేలు చేసేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.


కావాలనే కొందరు నేతలు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతిసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తమ ఆస్తులు కాపాడుకునేందుకు మూసీ బాధితులను పావులుగా వాడుకుంటున్నారని ఫైరయ్యారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌ల ఫామ్ హౌస్‌లు మంచివో, దొంగవో తేల్చటానికి సిద్ధమన్నారు. వాటిపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని సూచించారు. అజీజ్‌నగర్‌లో ఉన్న హరీశ్ ఫామ్‌హౌస్, జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్‌హౌస్‌ల సంగతి తేల్చుదామని.. ఆ తర్వాత మూసీ, మల్లన్నసాగర్, ఎక్కడికైనా వెళ్దామని సవాల్ విసిరారు. మూసీ ప్రక్షాళన కోసం గత ప్రభుత్వమే జీవో ఇచ్చిందని.. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పారు.


హైడ్రా అనగానే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బయటకు వచ్చారని.. పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకోగలరా? అని రేవంత్ ప్రశ్నించారు. మూసీ మురికిలో ఉన్న పేదలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పేదలకు మేలు జరుగుతుంటే కొందరు ఓర్వటం లేదని.. వాళ్ల ఫాంహౌస్‌లపై బోల్డోజర్లు వస్తాయనే భయంతోనే కేటీఆర్, హరీశ్‌రావు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.


Latest News
 

ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM
తెలంగాణ యువ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డు కైవసం Sat, Oct 19, 2024, 09:26 PM