byసూర్య | Sat, Sep 23, 2023, 12:27 PM
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో శనివారం జరిగే యాదవ సంఘం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ముఖ్య అతిధిగా ఆ సంఘ నాయకులు, పెద్ద గొల్ల, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ కే. చిన్నవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఈ భవన నిర్మాణం కొరకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. యాదవ సంఘం కుటుంబ సభ్యులందరూ భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు.