byసూర్య | Sat, Sep 23, 2023, 12:28 PM
శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం సిత్యాతండాకు చెందిన ధనావత్ బాలు వజ్రాల విక్రయం పేరిట పలువురుని మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధనావత్ బాలు తన దగ్గర రూ. 200 కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయని వీటిని ప్రత్యేక రసాయనాలతో శుద్ధి చేస్తే మంచి ధర వస్తుందని చెప్పి పలువురు వద్ద లక్షల్లో వసూలు చేశాడు. బాధితులు మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.