పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం

byసూర్య | Sat, Oct 19, 2024, 03:38 PM

మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం, వరంగల్, నల్గొండ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా, గూడూరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను, బిజెపి మండల అధ్యక్షుడు గుండబోయిన మల్లేష్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మేరెడ్డి సురేందర్ మాట్లాడుతూ.... ప్రశ్నించే గొంతుక.. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకై బిజెపి అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. నూతన ఓటర్ నమోదు ప్రక్రియలో ఈరోజు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలోని ఉపాధ్యాయులను కలిసి, ఓటర్ నమోదు పత్రాన్ని అందించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రానున్న  ఎం.ఎల్.సి. ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 10 సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మాయ మాటలతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తూనే ఉన్నాయి. కావున మార్పు కోసం ఈసారి బిజెపిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పడాల నాగరాజు, చింత బాలయ్య, వడ్లకొండ యాకయ్య, సాయిబాబా, లక్ష్మణ్, ధారావత్ లాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM