byసూర్య | Fri, Jun 02, 2023, 03:55 PM
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రేవంత్రెడ్డి లాగా తనకు పార్టీలు మారడం చేతకాదని, ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం చేతకాదని చెప్పారు. సొంత పార్టీ నేతలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం తనకు తెలియదని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి పార్టీని ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి,జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.