byసూర్య | Fri, Jun 02, 2023, 03:54 PM
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈనెల 6న మంత్రి కేటీఆర్ 50 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్లోని ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో 50 పరిశ్రమలతో పాటు రూ.40 కోట్లతో నిర్మించిన కామన్ ఫెసిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించనున్నారు. అక్కడే 100 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న టాయ్స్ పార్క్కు శంకుస్థాపన చేస్తారు.