తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది,,,బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది

byసూర్య | Fri, Jun 02, 2023, 07:16 PM

తెలంగాణ దశాబ్ది ఉత్సవాళ వేళ తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నూతన రాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా... నూతన సెక్రటేరియట్‌లో సీఎం పతాకావిష్కరణ చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.


తెలంగాణ ప్రజలకు ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని.. ఉద్యమానికి నాయకత్వం వహించే అదృష్టం తనకు దక్కటం సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాల సహకారంతో ఉద్యమం శాంతియుతంగా జరగిందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత స్వపరిపాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. ప్రతి రంగంలోనూ ముందుండి దేశానికి దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. అవరోధాలు అధిగమిస్తూ అగ్రభాగాన నిలిస్తూ పురోగమిస్తున్నామన్నారు. దేశంలోనే బలీయమైన ఆర్థిక శక్తిగా నేడు తెలంగాణ ఎదిగిందన్నారు.


దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తున్నామని.. పోడు భూములకు రైతు బంధు వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దాని వెనక మానవీయ కోణమే ఉంటుందన్నారు. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే భాగంగా 24 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పారు. గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపడతామన్నారు. రెండో విడత ఈనెల 9 నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజవర్గంలో 3 వేల మంది లబ్ధిదారులకు రూ.3 లక్షల చొప్పున సొంతింటి నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పారు.


ఇప్పటి వరకు 50 వేల మందికి దళిత బంధును అందించామని.. రెండో విడతలో మరో 30 వేల మందికి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు గ్రాంట్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా 47 వేల చెరువులను పునరుద్ధరించామని వెల్లడించారు. మిషన్ భగీరథకు ఎన్నో అవార్డులు లభించాయని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఫ్లోరైడ్ బాధలు లేవన్నారు. గతంలో పవర్ హాలీడేలో పరిశ్రమలు ఉండేవని నేడు ఆపరిస్థితులు లేవని చెప్పారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనానికి పెద్దపీట వేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యతను ఇస్తున్నామని.. తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. ఐటీరంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయన్నారు.


తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతకు ముందు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో పతాకావిష్కరణ చేశారు. అనంతరం గన్ పార్క్ వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళలర్పించారు. అక్కడి నుంచి సెక్రటేరియట్ చేరుకొని దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.



Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM