byసూర్య | Tue, Mar 28, 2023, 11:53 AM
మెదక్ జిల్లా రామయంపేట్ మండలం కాట్రియల్ పర్వతాపూర్ అడవి శాఖను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్, బీట్ ఆఫీసర్లు అర్జున్, సాయి కృష్ణ అన్నారు. అడవి శాఖ అడవి వన దర్శిని కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవడిలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిపై అవగాహన కల్పించారు. అడవిలో ఉన్న కలప, జంతువులు తాగే సాసర్ ఫిట్లు, వాటిపై కదిలికలపై తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.