byసూర్య | Tue, Mar 28, 2023, 11:50 AM
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి గ్రామంలో సోమవారం రెండు విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ మంజుల కాశీనాథ్, సర్పంచ్ నాగరాణి నర్సింలు కంటి వెలుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, ఎంపీడీవో గణేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుంధతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కృతిక రెడ్డి, ఉప సర్పంచ్ సంతోష గోపాల్, అంగన్వాడి టీచర్లు శైలజ, నాగమణి, ఆశ వర్కర్లు సౌందర్య, ప్రజలు పాల్గొన్నారు.