byసూర్య | Thu, Mar 23, 2023, 11:59 AM
చేగుంట మండల కేంద్రంలోని తైబజార్ వేలం పాటను గురువారం నిర్వహిస్తున్నట్లు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించే తైబజార్ వేలంలో ఆసక్తి ఉన్నవారు గ్రామపంచాయతీ సూచించిన విధంగా డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు వేలంపాటలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.