byసూర్య | Tue, May 07, 2024, 04:42 PM
జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం బాలనగర్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10: 00 గంటలకు గౌతాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 11: 00 గంటలకు బోడు జానంపేట, పలుగు మీది తండా, అప్పాజీపల్లి, చిన్నరేవల్లి తదితర గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.