byసూర్య | Tue, May 07, 2024, 04:36 PM
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ది చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు అగ్రనాయకత్వ బహిరంగ సభలలో పాల్గొంటూ మరో వైపు ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి సభలకు వచ్చే జనాలను చూసి ప్రత్యర్దుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.