byసూర్య | Tue, May 07, 2024, 04:38 PM
నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోరుతూ మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి దామరచర్ల మండలంలో ప్రచారం చేశారు. దామరచర్ల జైత్రం తండాలో కాంగ్రెస్ కరపత్రాలు పంచి ఈవీఎం మిషన్లో మూడో నెంబర్ చేయి గుర్తు పై ఓటు వేయాలని కోరారు. యువనేత రఘు వీర్ కి భారీ మెజారిటీ కట్టబెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.