byసూర్య | Thu, Dec 08, 2022, 10:47 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి చౌరస్తా వద్ద యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆఫ్ బాచుపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఐక్య క్రిస్మస్ సందడి‘ వేడుకల్లో బుధవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత గౌరవం కల్పిస్తున్నారని. అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకోవాలని అన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు ఎటువంటి సహాయ సహకరాలకైనా ముందుంటామని చెప్పారు.