byసూర్య | Wed, Dec 07, 2022, 08:45 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో గోల్ మాల్ గోవిందం అంటూ అడ్డగోలుగా మాట్లాడే వారు ఎక్కువైపోయారని విమర్శించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని సూచించారు.దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ పాలన చాలా ప్రమాదకరమని అన్నారు.ప్రభుత్వ సంస్థలన్నీ కేంద్రం అమ్ముతోందని విమర్శించారు.