byసూర్య | Sat, Dec 03, 2022, 11:35 AM
మేడ్చల్ జిల్లా జోహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం నాడు జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు నంది కంటి శ్రీధర్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్ వజ్రేష్ యాదవ్ పాల్గొంటారని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.