byసూర్య | Sat, Dec 03, 2022, 11:23 AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన కలెక్టరేట్ సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే, పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఏడాదిలోగా ఈ ఆసుపత్రి పనులు పూర్తిచేసి, జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ వద్ద వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.