byసూర్య | Sat, Dec 03, 2022, 11:21 AM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు శుక్రవారం సీబీఐ నోటీసులిచ్చింది. కాగా ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ కవిత పేరును చేర్చింది. లిక్కర్ స్కాం కేసులో లెక్కలపై సీబీఐ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయాల్లో ఎక్కడైనా హాజరు కావొచ్చని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈనెల డిసెంబర్ 6న కవిత హైదరాబాద్లో ఉ. 11 గం. కు విచారణకు హాజరు కానున్నారు.