byసూర్య | Thu, Dec 01, 2022, 01:43 PM
జహీరాబాద్ పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రధాన రహదారి గుండా ఎయిడ్స్ అవగాహన కల్పిస్తూ సాగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అస్లాం ఫారోకి మాట్లాడుతూ విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచి, ఎయిడ్స్ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎస్. రాములు, ముజఫర్ అలీ. లెక్చరర్లు నాగరాజు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.