byసూర్య | Thu, Dec 01, 2022, 01:41 PM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలంలోని ఫత్తేపూర్ చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపం వద్ద, మలి దశ తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు స్తూపం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం ఇంచార్జ్, నాయకులు గుండు మోహన్ తదితరులు పాల్గొన్నారు.