byసూర్య | Thu, Dec 01, 2022, 01:48 PM
వనపర్తి జిల్లా మదనాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పోలీస్ కిష్టయ్యకు మండల ముదిరాజ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నివాళి అర్పించారు. కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి సభ్యులు కృష్ణయ్య యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రావణ్ కుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాంనారాయణ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కురుమూర్తి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చీర్ల శ్రీనివాసులు, గోవిందహల్లి సర్పంచ్ శ్రీనివాసులు, జిల్లా రైతుబంధు సభ్యులు రవీందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, వివిధ పార్టీల నాయకులు వెంకట్ నారాయణ, నాగన్నయాదవ్, వాసురెడ్డి, అంజద్అలీ, జగదీష్, ముదిరాజ్ సోదరులు ఆంజనేయులు, వెంకటస్వామి, వాకిటి రంగన్న గుగ్గిల్ల రాములు, దండు విష్ణు, దాసరి రమేష్, చుక్క రాములు, చుక్క అంజి, దాసరి వెంకటేష్, బాలురాజు, తిరుపతి, యాట శ్రీను, పాల్గొన్నారు.