పలువురికి కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ షర్మిల
byసూర్య |
Wed, Nov 30, 2022, 02:12 PM
తన పోరాటానికి మద్దతు తెలిపిన పలువురు నేతలకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలిపారు. పాలకపక్ష ఆగడాలు పతాక స్థాయికి చేరినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దాడులకు పాల్పడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా నిలదీయడం అందరి కర్తవ్యమని షర్మిల పేర్కొన్నారు. తన పోరాటానికి మద్దతుగా నిలిచి, తనపై ప్రభుత్వ దాడిని ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
Latest News