byసూర్య | Tue, May 07, 2024, 12:06 PM
మల్కాజిగిరి పార్లమెంట్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గౌడ్ పాల్గొనడం జరిగింది. సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీలందరూ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలు ముస్లింలను ఓట్ల కోసం వాడుకున్నారని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముస్లిం మైనార్టీ సోదరులకు అండగా ఉందని తెలిపారు. కాంగ్రెస్,బిజెపి పార్టీలు మల్కాజిగిరి కి ఏమీ చేయలేదు, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే అని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.