నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు,,,ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్

byసూర్య | Sun, May 19, 2024, 07:34 PM

హైదరాబాద్ నగరంలో ఉప్పల్ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి బోడుప్పల్, చెంగిచెర్ల క్రాస్ రోడ్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను భగాయత్ రోడ్డుపై మళ్లిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.


Latest News
 

హైదరాబాద్ చుట్టూ.. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు Sun, Mar 15, 2026, 08:13 PM
నర్మెటలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ,,,,నిరుద్యోగులకు ఉపాధి Sun, Mar 15, 2026, 08:09 PM
ఏ డ్రగ్స్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు Sun, Mar 15, 2026, 07:57 PM
అత్తాపూర్‌లో రూ.500 కోట్ల విలువైన భూమి స్వాధీనం,,,హైడ్రా మరో భారీ ఆపరేషన్ Sun, Mar 15, 2026, 06:26 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు Sun, Mar 15, 2026, 06:21 PM