byసూర్య | Tue, Nov 29, 2022, 06:31 PM
వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. నర్సంపేటలో పోలీసులు అరెస్ట్ చేసి షర్మిలని హైదరాబాద్ తరలించారు. దీంతో ఆమె పాదాయాత్ర ఒక్కసారిగా ఆగిపోయింది. దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తీసుకున్నారు. దీంతో షర్మిలకు కాస్త ఊరట లభించినట్లయింది.