byసూర్య | Tue, Nov 29, 2022, 06:36 PM
వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించిచారు. పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా షర్మిల మంగళవారం మధ్యాహ్నం దాడిలో ధ్వంసమైన కారులో ప్రగతి భవన్కు బయలుదేరగా, పంజాగుట్ట చౌరస్తాలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు షర్మిలను ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచనున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కుమార్తె కోసం బయలుదేరిన వైఎస్ విజయమ్మను లోటస్ పాండ్లోని ఆమె ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్లో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు.