byసూర్య | Thu, May 02, 2024, 01:23 PM
దేవరకొండ నియోజకవర్గం విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఇద్దంపల్లిలో చోటుచేసుకుంది. సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి(48) ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం అదే గ్రామానికి చెందిన బాల్ బి ఇంట్లో ఫ్యాను రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.