11 మంది రేపిస్టుల విడుదలపై కేటీఆర్ ఫైర్
byసూర్య |
Wed, Aug 17, 2022, 03:41 PM
75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేశారు. దీనిపై బుధవారం మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ మహిళలను గౌరవించాలని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజరాత్లో రిలీజైన 11 మంది రేపిస్టుల విడుదల అంశంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని అన్నారు. రేపిస్టులకు బెయిల్ ఇవ్వకుండా చట్ట సవరణలు చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Latest News