byసూర్య | Wed, Aug 17, 2022, 11:42 AM
ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, బస్తీ దవాఖానలతో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మున్సిపాలిటీ పరిధిలోని పేద ప్రజలకు సత్వర వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బస్తీ దవాఖానలను ప్రారంభించామని తెలిపారు. బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.