byసూర్య | Wed, Aug 17, 2022, 11:38 AM
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా మోదీ నెరవేర్చలేదని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ధి మోదీకి లేదని యెద్దేవా చేశారు.
ఎర్రకోట నుంచి నిన్న ప్రసంగించిన మోదీ 2047 సంవత్సరం నాటికి సాధించాల్సిన కొత్త లక్ష్యాలపై మాట్లాడారన్నారు. వినడానికి అవి ఎంతో బాగున్నాయన్న కేటీఆర్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేరలేదన్న సంగతిని ప్రధాని ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. లక్ష్యసాధనలో ఎదురైన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా కొత్త వాటి గురించి చెపితే విశ్వసనీయత ఏముంటుందంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.