లక్ష్యాలను సాధించే చిత్తశుద్ధి మోదీకి లేదన్న మంత్రి కేటీఆర్

byసూర్య | Wed, Aug 17, 2022, 11:38 AM

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా మోదీ నెరవేర్చలేదని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ధి మోదీకి లేదని యెద్దేవా చేశారు.

ఎర్రకోట నుంచి నిన్న ప్రసంగించిన మోదీ 2047 సంవత్సరం నాటికి సాధించాల్సిన కొత్త లక్ష్యాలపై మాట్లాడారన్నారు. వినడానికి అవి ఎంతో బాగున్నాయన్న కేటీఆర్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేరలేదన్న సంగతిని ప్రధాని ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. లక్ష్యసాధనలో ఎదురైన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా కొత్త వాటి గురించి చెపితే విశ్వసనీయత ఏముంటుందంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM