byసూర్య | Wed, Aug 17, 2022, 11:43 AM
వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచ గ్రామనికి చెందిన కోమలత (20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం 12 గంటలకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. మహిళకు 6 నెలల పాప శరణ్య ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.